గోపాల్పేట: అభివృద్దిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు అన్నారు. శనివారం ఆయన పాన్గల్ మండలం లోని రేమద్దుల గ్రామంలో రైతు వేధిక భవనం ప్రారంభోత్సవానికి వెళుతూ కొద్దిసేపు గోపాల్పేట మండల కేంద్రంలో ఆగారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయానికి సొంత భవనం కావాలని గ్రామస్తులు కోరగా, స్పందించిన ఆయన గ్రంథాలయం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. నూతన భవన నిర్మాణానికి తమ వంతు సాయాన్ని అందజేస్తానన్నారు.
అంతకుముందు ఆయన టీఆర్ఎస్ నాయకుడు గాజుల కోదండం ఇంట్లో విలేకర్లతో మాట్లాడారు. రైతులు సన్నరకాల వైపు మొగ్గు చూపాలని, దొడ్డు రకాల సాగు దూరం పెట్టాలన్నారు. దొడ్డు రకం ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పిన మాట ఈసందర్బంగా ఆయన గుర్తు చేశారు. సాగు నీటి రాకతో వ్యవసాయం పండుగలా మారిందని, వలసలు ఆగి ఇతర రాష్ర్టా ల వారు ఇక్కడికి వలసలు వస్తున్నారన్నారు. గద్వాల నుంచి మాచెర్ల రైల్వే లైన్ గురించి ప్రస్తావిస్తూ దీనిపై పార్లమెంటు లో మాట్లాడతానన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ విధిగా తీసుకోవాలని వ్యాక్సిన్ ప్రాణానికి రక్షణగా ఉంటుందన్నారు. వ్యాక్సినేష న్ విషయమై ప్రభుత్వం పత్యేక చర్యలు తీసుకొని దేశంలోనే రాష్ట్రం ముందుదన్నారు.
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మండల వాల్మీకి నాయకులు ఎంపీ రాములుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మంద భార్గవి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సింగిల్విండో వైస్ చైర్మన్ గువ్వల రాములు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బి.బాల్రాజు, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, కోఆఫ్షన్ సభ్యులు ఎండీ. మతీన్, వనపర్తి పోస్టల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ అభిన్శర్మ, గ్రామ రైతు బంధు అధ్యక్షుడు మణ్యెం నాయక్, టీఆర్ఎస్ నాయకులు కోళ్ల వెంకటేశ్, కాశీనాథ్, కోదండం, రవి,నాగరాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.