వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
25మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
వనపర్తి, మే 21 : ప్రతిఒక్కరూ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. వనపర్తి నియోజకవర్గానికి చెందిన 25మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.10లక్షల 68వేల విలువైన చెక్కులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని దృష్టి లో ఉంచుకుని అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. ప్రభుత్వ సూచనల ను అందరూ పాటించి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిప ల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.