దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
భూత్పూర్, ఏప్రిల్ 16 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తమొల్గర గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం లో ఎక్కడా రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వంతోపాటు, అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదన్నారు. తెలంగాణలో గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మద్దతు ధర అందిస్తూ సింగిల్ విండో, ఐకేపీల ఆధ్వర్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, విండో చైర్మన్ కదిరె అశోక్రెడ్డి, సర్పంచ్ వెంకటమ్మ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, నాయకులు మణెమోని సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, అశోక్గౌడ్, ప్రతాప్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎంపీడీవో
రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా గాంధీ