హైదరాబాద్ : సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానను రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మారుస్తూ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో శనివారం నుంచి దవాఖానలో ఓపీ సేవలను నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను సైతం నిలిపి వేసి కేవలం కొవిడ్ బాధితులకు మాత్రమే వైద్యులు చికిత్స అందించనున్నారు.
ఇప్పటికే దవాఖానలో 450కి పైగా రోగులు ఉన్నారు. నిన్న ఒక్కరోజే 150మంది చికిత్స నిమిత్తం చేరారు. గాంధీ దవాఖానకు కొవిడ్ రోగుల తాకిడి క్రమంగా పెరుగుతున్నది.
దీంతో బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఇతర డిపార్టుమెంట్లను వైద్యులు ఖాళీ చేయిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి