జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి
వనపర్తి రూరల్, జూన్ 5 : పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెడ్పీ చైర్మన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడలన్న ఆలోచనతోనే హరితహారం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని, దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసిన పచ్చని చెట్లతో గ్రామా లు నెలకొన్నాయన్నారు. ప్రతి పల్లె పచ్చగా ఉండాలన్న ఆలోచనతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లోని ప్రజలు ఆహ్లాదరకరమైన వాతవరణంలో మెలిగెలా చేస్తున్నారన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దాని నివారణకు భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీను , సాగర్, కిరణ్కుమార్గౌడ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకృతియే జీవం
వనపర్తి టౌన్, జూన్ 5: మానవ మనుగడకు ప్రకృతియే జీవనధారమని జూనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి కోర్టు ఆవరణంలో ఆమె న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణకోటికి చెట్లు జీవనధారమని, పర్యావరణ సమతుల్యతకు ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. సకాలంలో వర్షాలు కురవాలన్న, భూతాపం, ఉష్ణోగ్రత నుంచి, కాలుష్యం నుంచి మనిషి రక్షించాలంటే మొక్కలే ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు మోహన్కుమార్, వెంకటరమణ, డేగల కృష్ణయ్య ఉన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..
జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్య ంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ప్రిన్సిపాల్ చందోజీరావు అధ్యాపకులతో కలిసి మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణే మానవుని ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారం ధాంసింగ్, అధ్యాపకులు కురుమయ్య, రమేశ్, సురేందర్రెడ్డి, యాదగిరి, లక్ష్మి, సునీతాబాయ్, రామకృష్ణమూర్తి, మల్లికార్జున్, వెంకటస్వామి, గణేశ్, రాధాకృష్ణ ఉన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
కొత్తకోట, జూన్ 5: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని జాతీయ హరి త దళం జిల్లా సమన్వయ కర్త సుదర్శన్రావు అన్నారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎస్సీ కాలనీలో జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ మొక్కలను పంపిణీ చేశారు. నేటి మొ క్కలు భవిష్యత్లో మంచి ఫలితాలను ఇస్తాయని పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని వాటిని రక్షిస్తేనే ఉపయోగం ఉంటుందన్నారు. మొక్కలు లేకపోతే కరువు కటకాలు సంభవిస్తాయన్నారు.
మొక్కలు ఉండటం వల్ల వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పుష్కలంగా పండుతాయన్నారు. జామ, బొప్పాయి, కరెపాకు, సీతాఫలం వంటి మొక్కలను అందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సతీశ్రాజ్, కర్ణకుమార్, రాకేశ్, కళ్యాణ్, జైపాల్, రాజు ఉన్నారు.