వనపర్తి, జనవరి 11 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ఎల్లప్పుడు అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పార్ట్టీలో క్రియాశీల సభ్యత్వం తీసుకుని ఇటీవల ప్రమాదవ శాత్తు మరణించిన ఆరుగురు కార్యకర్తల కుటుంబాలకు మంజూరైన బీమా రూ.2లక్షల విలువ గల చెక్కు ను మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబసభ్యులకు మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త కు పార్టీ నుంచి రూ.2లక్షల విలువ గల బీమాను చే యించామని, కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందు కు పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని నిర్వహించామని మంత్రి వివరించారు. చెక్కులు అందుకున్న వారిలో వనపర్తి మండలం కండ్రియాతండాకు చెందిన బోయబాబు సతీమణి రేణుక, గోపాల్పేట మండలం చెన్నూర్కు చెందిన భూత్పూర్ మద్దిలేటి సతీమణి లక్ష్మి, ఏదుల గ్రామానికి చెందిన తోలెకాశీం తం డ్రి బాలస్వామి, పెద్దమందడి మండలం మంగంపల్లితండాకు చెందిన మెగావత్ తేజానాయక్ సతీమణి శాంతమ్మ, పెబ్బేర్కు చెందిన కావలి పురుషోత్తం సతీమణి లక్ష్మిలకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి రమేశ్ ఉన్నారు.
రైతుసంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ రైతుసంఘం వనపర్తి జిల్లా నూతన క్యా లెండర్ను మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి బాల్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పరమేశ్వరాచారి, నా యకులు నారాయణదాస్ కిట్టు పాల్గొన్నారు.
విద్యార్థులు సృజనాత్మకతకు పదునుపెట్టాలి
విద్యార్థుల్లో గొప్ప సృజనాత్మకత దాగి ఉందని, వారిని కొంచెం సానపడితే అద్భుత ప్రతిభ చూపుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గుర్తు చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నాగవరం రైతు వేదికలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, మహిళా సంఘాలు, రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చారని, సామాజిక అంశాలపై మరోసారి విద్యార్థులకు పోటీలను నిర్వహించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్, పర్యావరణం, ఆరో గ్యం వంటి అంశాలపై వారం రోజులు సమయం ఇచ్చి పోటీలను నిర్వహించాలని, మొత్తం 60 పాఠశాలలో నిర్వహించే పోటీలకు అయ్యే ఖర్చును సొంతంగా భరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కొత్తకోట మైనార్టీ గురుకుల పాఠశాల 9వ తరగతికి చెందిన సరిత మొదటి బహుమతి సాధించిన సందర్భంగా మంత్రి నిరంజన్ రె డ్డి బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.