కోహిమా: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గకపోవడంతో నాగాలాండ్ ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించింది. ఈ నెల 30 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకు ప్రజలు బయటకు వెళ్లకూడదని, ఎలాంటి వాహనాలు తిరగడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో వరుసగా 13వ రోజు కరోనా రికవరీలు పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,097కు చేరింది. నిన్న ఒక్కరోజే 362 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2059 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 86.68 శాతంగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది.