వనపర్తి, జూలై 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న గొర్రెల పంపిణీతో గొల్ల, కురుమలకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గొర్రెల కాపరుల సంఘం పాలకవర్గంతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా చే పట్టాలని ఆదేశించారు. గొర్రెల పంపిణీలో కాపరుల సంఘం పాలకవర్గం ప్రత్యక్షంగా పాల్గొని శ్రద్ధ వహించాలని సూచించారు. వనపర్తి పట్టణంలో మిగిలిపోయిన రెండు సొసైటీల సభ్యులకు గొర్రెల పంపిణీని ఈ విడుతలో చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో గొర్రెల పరిశోధన, పునరుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఏ రంగంలో ప్రజలకు ఉపాధి లభిస్తుందో అలాంటి వాటిపై ప్ర భుత్వం దృష్టి సారించి ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. ఉచిత చేప పిల్లల పంపిణీతో గ్రామాల్లో మత్స్యకారులకు ఉపాధితోపాటు ప్రజలకు పౌష్టికాహారం అందుతున్నదన్నారు.
సీఎం కేసీఆర్ ముందు చూపుతో నేడు రాష్ట్రంలో నీలివిప్లవం వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన ఎన్సీడీసీ (నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నిధుల కోసం కేంద్ర మంత్రిని కలుస్తామని చెప్పారు. జిల్లా గొర్రెల కాపరుల సంఘం ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో హోల్సేల్ ధరలకే మందుల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయించేందుకు అనుమతినివ్వాలని మంత్రిని పాలకవర్గం కోరింది. సమావేశంలో గొర్రెల పెంపకందారుల సహాయక యూనియన్ అధ్యక్షుడు కురుముర్తి యాదవ్, ఉపాధ్యక్షుడు చంద్రయ్య యాదవ్, జిల్లా డైరెక్టర్లు బీచుపల్లి యా దవ్, దేవేందర్ యాదవ్, నాగేంద్రం యాదవ్, భాగన్న యాదవ్, కొల్లంపల్లి యాదవ్, రాజశేఖర్ యాదవ్, కుర్వ రాజేశ్ యాదవ్, తిరుమల్ యాదవ్, నరసింహ యాదవ్, పరశురాం యాదవ్ పాల్గొన్నారు.
సమస్యకు ఆత్మహత్యలు పరిష్కారం కావు..
సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, ఆత్మవిశ్వాసంతో జీవించాలని మం త్రి నిరంజన్రెడ్డి సూచించారు. బీటెక్ విద్యార్థిని లావణ్య ఆత్మహత్య బాధాకరమని ఆ వేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లావణ్య కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏమైనా సమస్యలుంటే పక్కవారితో, స్నేహితులతో పంచుకోవాలన్నారు. మనసులో పెట్టుకుని బాధపడొద్దని సూచించారు. లావణ్య కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇంటితోపాటు సోదరుడు భరత్ పైచదువులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలలో అర్హత కలిగిన ప్రతి పథకాన్ని అందేలా చూస్తామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఎల్లప్పు డూ అందుబాటులో ఉంటానని చెప్పారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గట్టు యా దవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ నేత కోల వెంకటేశ్, కౌన్సిలర్లు ఉన్నారు.