వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని అజాది అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో చేపట్టి 2కేరన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం నుంచి అటవీ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరళీకృష్ణగౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, యువత పాల్గొన్నారు.