పరిగి, జూన్ 1 : పేద యువతుల వివాహానికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని తాసిల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 143 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ఈ పథకాల ద్వారా లక్షలాది మంది పేద యువతుల వివాహానికి సర్కారు ఆర్థికసాయం అందించిందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, తాసిల్దార్ విద్యాసాగర్రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఎ.సురేందర్కుమార్ పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు
గ్రామాల్లో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి మండల పరిధిలోని 8 గ్రామాలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా ఒక్కో గ్రామానికి రూ.2లక్షల చొప్పున సీసీ రోడ్డు పనుల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్లను ఎంపీటీసీలకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలోను అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో అవసరమైన పనులు చేపట్టడం ద్వారా ప్రజల సమస్యలు తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీటీసీ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.