వికారాబాద్ : పట్టణంలోని శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగించాలని, వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మున్సిపల్ అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పట్టణ ప్రగతి, శానిటేషన్, హరితహారం, అండర్ డ్రైనేజీ తదితర పనులపై పూర్తి చేయాలన్నారు.
గతంలో ఎమ్మెల్యే సూచించిన పనులు ఎంత వరకు సఫలీకృతం అయ్యాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జరుగబోయే పనుల వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజులరమేశ్కుమార్, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, ఈఈ రామ్కిషన్, టీపీవో శ్రీధర్, ఏఈ రాయుడు, టీపీఎస్ వేణుగోపాల్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.