మోమిన్పేట : గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో నేరాలను నియంత్రించొచ్చని ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్న కొల్కుంద గ్రామంలో సర్పంచ్ కొనింటి సురేశ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా 50 శాతనికి పైగా నేరాలను అదుపు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని అందుకే ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలని తెలిపారు.
గ్రామంలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ను అభినందించారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రషీద్, డీఏస్పీ సంజీవరావ్, సీఐ వెంకటేశం, ఎస్సై శేఖర్గౌడ్, ఎంపీటీసీ శ్రీదేవి బుజంగం, ఉప సర్పంచ్ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి సుమిత, గ్రామస్తులు కుమార్, అశోక్, ఖాజ పాషా, సిద్ధన్న, ప్రవిణ్, బస్వరాజ్, మల్లన్న, చెన్నరెడ్డి పాల్గొన్నారు.