కేటీదొడ్డి, జూన్ 5 : కరోనా బారిన పడిన వారు ఇంట్లోనే ఉండి వైద్యులు ఇచ్చిన మందులు వాడాలని, అలా కాకుం డా బయట తిరిగితే కేసులు నమోదు చేసి ఐసోలేషన్కు తరలిస్తామని ఎస్సై కురుమయ్య హెచ్చరించారు. మండలంలో ని ఉమిత్యాల తండాలో పాజిటివ్ వచ్చిన వారిని శనివారం గద్వాల ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భం గా ఎస్సై కురుమయ్య మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తులు కనీసం 14 రోజులు హోం ఐసోలేషన్లో ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, తాసిల్దార్ గజ్జఫ్పార్ హుస్సే న్, పోలీస్ సవారన్న పాల్గొన్నారు.
అనవసరంగా బయటకు రావొద్దు
గద్వాల అర్బన్, జూన్ 5 : అనవసరంగా బయట తిరిగితే ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తామని టౌన్ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై విక్రం సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం 2 తరువాత అనవసరంగా బయటకు వచ్చిన వారిని ఐసోలేషన్కు తరలించారు.
ధరూరులో..
ధరూరు, జూన్ 5 : లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి.. బయటకు వచ్చిన వారిని ఐసోలేషన్కు తరలించనున్నట్లు ఎస్సై రాములు హెచ్చరించారు. శనివారం అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానాలు విధించి, ఐసోలేషన్కు తరలించారు. కార్యక్రమంలో పోలీసులు ఉన్నారు.
మల్దకల్లో..
మల్దకల్, జూన్ 5 : కరోనా పాజిటివ్ వచ్చిన వారు బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై శేఖర్ శనివారం తెలిపారు. వైద్యుల సలహాలు పాటిస్తూనే మందులు వేసుకోవాలని పేర్కొన్నారు.