మెదక్, మే 13 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా పటిష్ట ప్రణాళికతో కరోనాను కట్టడి చేస్తుంది. రెండో రోజు గురువారం లాక్డౌన్ విజయవంతమైంది. ఉదయం 6 గంటలకే దుకాణాలు తెరుచుకోవడంతో ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి రోడెక్కారు. దీంతో మార్కెట్లతో పాటు కిరణాషాపులు, మెడికల్ షాపులు, ఆయా రకాల దుకాణాలు కిటకిటలాడాయి.
రోడ్లన్నీ నిర్మానుష్యం..
లాక్డౌన్ సందర్భంగా జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు ఉదయం 10 మనోహరాగంటలకల్లా నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, బాద్, రామాయంపేట, చేగుంట, కౌడిపల్లి పట్టణ కేంద్రాల్లోని రహదారులు ఒక్కసారిగా బోసిపోయాయి. మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్ జాతీయ రహదారి వెలవెలబోయింది.
ఉదయం నాలుగు గంటలే కొనుగోళ్లు..
లాక్డౌన్ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యావసర కొనుగోళ్లకు బయటకు రావాలనే నిబంధన ఉంది. ప్రతి రోజు ఉదయం 6 గంటల వరకే ప్రజలు రోడ్లపైకి వచ్చి వారికి కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తున్నారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట,మే13: రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ రెండోరోజు గురువారం పెద్దశంకరంపేటలో విజయవంతమైంది. పది గంటల తర్వాత వ్యాపారులు దుకాణాలు మూసివేయడంతో రహదారులు నిర్మానుషంగా మారి వెలవెల బోయాయి. వాహనాలు తిరుగక పోవడంతోనాందేడ్ అకోలా జాతీయ రహదారి వెలవెలబోయింది. పేట ఎస్సై నరేందర్ పోలీసులతో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు.
మెదక్ మున్సిపాలిటీలో..
కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా కేంద్రంలో రెండో రోజు సంపూర్ణంగా కొనసాగింది. గురువారం ఉదయం 4గంటలు మాత్రమే మినహయింపు ఇవ్వడంతో నిత్యవసరాలు, ఇతరవస్తువులను ప్రజలు కొనుగోలు చేశారు. అనంతరం 10 గంటల నుంచి లాక్డౌన్ ప్రారంభం కావడంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రోడ్లని నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవ లు మాత్రమే కొనసాగాయి. నిబంధనల ప్రకారం అనుమతులు ఉండి పాస్లు ఉన్నవారినే అనుమతించారు.
చిన్నశంకరంపేటలో..
చిన్నశంకరంపేట, 13 మే: మండలంలోని వివిధ గ్రామాల్లో రెండోరోజు లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం 10 తర్వాత వ్యాపార వాణిజ్య సంస్థలు మూసి వేశారు. రోడ్లపై జనం లేక నిర్మానుష్యంగా మరాయి.ఎస్సై మహ్మద్గౌస్ గ్రామాల్లో తిరుగుతూ దుకాణాలను మూసివేయించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, మే 13 : రెండోరోజు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6 గంటలకే దుకాణాలను తెరువగా, నిత్యవసర వస్తువులు, ఇతర సామగ్రి కోసం ప్రజలు దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసి తిరిగి తమ ఇండ్లకు వెళ్లిపోయారు. 10 గంటల తర్వాత దుకాణాలను మూసివేయడంతో వెల్దుర్తి, మాసాయిపేటలతో పాటు పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. వెల్దుర్తి ఎస్సై మహేందర్ సిబ్బందితో కలిసి వెల్దుర్తితో పాటు పలు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించి, వాహనదారులను తనిఖీ చేశారు.
మెదక్ రూరల్లో..
మెదక్ రూరల్, మే13: కరోనాకట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రెండో రోజు మెదక్ మండల పరిధిలోని గ్రామాల్లో సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం ప్రభుత్వం లాక్డౌన్ సడలింపు ఇవ్వడంతో వినియోగదారులు తమకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేశారు. అనంతరం మెదక్ రూరల్ ఎస్సై కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. గ్రామాల్లో లాక్డౌన్ మూలంగా రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.