వికారాబాద్ : ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ధారూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతును రాజును చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు.
రైతుల సంక్షేమం గురించి ఆలోచించే గొప్ప నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు.
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజయ లక్ష్మి, జెడ్పీటీసీ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాములు, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, స్థానిక సర్పంచ్ చంద్రమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు వీరేశం, జనరల్ సెక్రెటరీ యూనూస్, హన్మంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.