హైదరాబాద్ : బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా పట్ల ప్రదర్శించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే ఒక ప్రకటన విడుదల చేసింది. టీ న్యూస్, నమస్తే తెలంగాణ ప్రతినిధులను బండి సంజయ్ అవమానపరిచే విధంగా మాట్లాడటం సరికాదు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే మీడియా సమావేశాలకు విలేకరులు రావడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. రాజకీయ నాయకులుగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. అంతేకానీ పనిగట్టుకుని కొన్ని మీడియా సంస్థల వాళ్లను బయటికి వెళ్లిపోండని మాట్లాడటం సరైంది కాదు. రాజకీయాలు వేరు.. మీడియా వేరు. రాజకీయాలను మీడియాకు అంటగట్టకండి. బండి సంజయ్ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే పేర్కొంది.
ఇవి కూడా చదవండి..