KCR | హైదరాబాద్ : తెలంగాణ భవన్ నుంచి పోరుయాత్రకు గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. భవన్కు చేరుకున్న కేసీఆర్కు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. మొదట భవన్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు కేసీఆర్. అనంతరం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు. బాణాసంచా కాల్చి బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
నేటి నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్ర కొనసాగనుంది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ వస్తున్నది. అయితే, సమయం తక్కువగా ఉండటం, ఎండ వేడి దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
తెలంగాణ భవన్ నుండి పోరుబాటకు బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. pic.twitter.com/gipZPHOFwQ
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2024