వికారాబాద్, అక్టోబర్ 25 : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సర్వసభ్య సమావేశం నిర్వ హిస్తున్నట్టు వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం రవీంద్రమండపంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొ చ్చారు. పలు శాఖలకు సంబంధించిన అధికారులు హాజరు కాకపోవడంతో సమస్యలు పరి ష్కారానికి నోచుకోలేకపోయాయి. రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన సమస్యలు పరి ష్కరించకపోవడంతో మండల కో ఆప్షన్ సభ్యుడు జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా ఎంపీపీ చంద్రకళ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల సహకారంతో అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కరించేందుకు అధి కారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత సర్వసభ్య సమావేశంలో చర్చించిన సమ స్యలు పరిష్కరించకపోవడంతోనే, మరోసారి సమావేశం దృష్టికి వస్తున్నాయని అధికారులపై మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిం చాలని తెలిపారు. సమావేశానికి గైర్హాజరైన అధికారుల వివరాలను కలెక్టర్కు నివేదిస్తామన్నారు. అటవీ , రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేసి గ్రామాలలో నెలకొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, వైస్ ఎంపీపీ కొండి రాములు, వ్యవసాయాధికారి రమేశ్, సీడీపీవో వెం కటేశ్వరమ్మ, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.