పరిగి, ఆగస్టు : అటవీ ప్రాంత అభివృద్దికి తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సూచించారు. శనివారం సాయంత్రం పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఇటీవల నాటిన మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా నాటిన ప్రతి మొక్క సంరక్షించాలన్నారు.
తద్వారా పచ్చదనం శాతం పెరుగుతుందని కలెక్టర్ చెప్పారు. 50 ఎకరాలలో నాటిన 16,600 మొక్కలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి వేణుమాధవ్, రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.