పరిగి, ఆగస్టు :పరిగి మండలంలోని మిట్టకోడూర్ గ్రామ ఉపసర్పంచ్గా గుడాల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పంచాయతీ అధికారి దయానంద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి 9 మంది వార్డు సభ్యులు హాజరవగా, ఉపసర్పంచ్గా గుడాల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎంపీవో దయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఉపసర్పంచ్గా ఎన్నికైన గుడాల మల్లయ్యను సర్పంచ్ పటేల్ జయలక్ష్మీజగదీశ్వర్, మాజీ సర్పంచ్ జగదీశ్వర్, మాజీ ఎంపీటీసీ మాణిక్యం, వార్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.