పరిగి, ఆగస్టు 5: పేదలను ఆదుకోవడం అభినందనీయమని పరిగి ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్లు అన్నారు. జన్ సాహస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామంలో వారు నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తూ ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తుందన్నారు.
దీనికితోడు స్వచ్చంద సంస్థలు పేదలకు అండగా నిలవడం ద్వారా వారికి మేలు చేస్తున్నాయని పరిగి ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్లు పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో పేదలలో మనోధైర్యం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, ఉపసర్పంచ్ జంగయ్య, జన్ సాహస్ సంస్థ ఉపాధ్యక్షుడు నవీన్, జిల్లా కో-ఆర్డినేటర్ ప్రకాష్, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.