మర్పల్లి : ఉపాధి హామీ పనిచేసిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, వివిధ పనులపై టీఏలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పని చేసిన ప్రదేశంలో తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. పనులకు సంబంధించిన ఏడు రిజిస్టర్లలో మూడు రోజులలో రికార్డులు పూర్తిచేయాలని లేకాపోతే సంబంధిత వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి లక్ష్మి, ఏపీవో అంజిరెడ్డి, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.