Viral video | సాధారణంగా స్కూటీ (scooter)పై ఎంత మంది ప్రయాణించొచ్చు..? ఇద్దరు.. లేదా ముగ్గురు. అంతకంటే ఎక్కువ ప్రయాణించడం కష్టం. ట్రాఫిక్ నిబంధనల ప్రకారమైతే ఇద్దరు మాత్రమే వెళ్లాలి. అయితే ఓ వ్యక్తి మాత్రం తాను కాకుండా మరో ఏడుగురు పిల్లల్ని ఎక్కించుకుని నెట్టింట వార్తల్లోకి ఎక్కాడు.
ముంబై (Mumbai)కి చెందిన 39 ఏళ్ల మున్వర్ షా ( Munavvar Shah) స్థానికంగా కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఇటీవలే ఆ వ్యక్తి ఏకంగా ఏడుగురు పిల్లలతో స్కూటీపై ప్రయాణించాడు. వీడియోలో మున్వర్ షా బైక్ నడుపుతుండగా.. ఇద్దరు పిల్లలు ముందు భాగంలో నిలబడి కనిపించారు. మరో ముగ్గురు వెనుక కూర్చోగా.. మరో ఇద్దరు వాహనం క్రాష్ గార్డ్ పై ప్రమాదకరంగా నిలబడి కనిపించారు.
ఇది చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా వైరల్ గా మారి పోలీసుల దృష్టికి చేరింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మున్వర్ షాను అరెస్ట్ చేసి.. అతని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
Not the ride we support!
This rider had put the life of all pillion riders and others in danger.
A serious offence u/sec 308 IPC for attempt to commit culpable homicide not amounting to murder has been registered against the accused rider. #FollowRules #SetRightExample https://t.co/PKgCY0grhN pic.twitter.com/q2VmoRi8oj
— Mumbai Traffic Police (@MTPHereToHelp) June 25, 2023
Also Read..
Air India | మరోసారి మలమూత్ర విసర్జన ఘటన.. వ్యక్తి అరెస్ట్
Goodenough | లిథియం అయాన్ బ్యాటరీస్ ఆద్యుడు గుడ్ ఎనఫ్ కన్నుమూత
New York Diwali | ఇకపై న్యూయార్క్ లో దీపావళి నాడు స్కూళ్లకు హాలిడే.. ప్రకటించిన మేయర్