Viral Video | ఆహారం ( Meal) కోసం రెండు పులల (Tigress) మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. చనిపోయిన జింక (deer)ను తినేందుకు ఆడపులి, మగపులి రెండూ ఒకదానికొకటి పోటాపోటీగా గొడవపడ్డాయి. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan)లోని రణథమ్బోర్ నేషనల్ పార్క్ (Ranthambore National Park)లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘లేటెస్ట్ సైటింగ్స్’ (Latest Sightings) అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు.
వీడియోలో ఏముందంటే..? ఓ మగ పులి జింకను వేటాడి చంపేస్తుంది. అనంతరం రోడ్డు మధ్యలో వదిలేసి పక్కకు వెళ్లిపోతుంది. అదే సమయంలో చెట్ల పొదల్లో నుంచి వచ్చిన ఓ ఆడపులి రోడ్డు మధ్యలో ఉన్న జింక కళేబరాన్ని చూస్తుంది. దాన్ని తినేందుకు ప్రయత్నిస్తుంది. అంతలోనే మగ పులి అక్కడికి వస్తుంది. ఈ క్రమంలో రెండు పులల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంటుంది. రెండూ కొద్దిసేపు అలానే కొట్లాడతాయి. కాసేపటికి ఆడ పులి కాస్త వెనక్కి తగ్గడంతో.. మగపులి జింక కళేబరాన్ని నోటితో పట్టుకుని చెట్ల పొదల్లోకి లాక్కెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read..
Boat capsizes in river Ganga | గంగానదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి.. 25 మంది గల్లంతు
Guyana School | పాఠశాల వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
Brahmanandam | ఘనంగా బ్రహ్మానందం రెండో కుమారుడి నిశ్చితార్థం