Boat capsizes in river Ganga | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బల్లియా జిల్లా (Ballia district)లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్ గంగా ఘాట్ (Maldepur Ganga Ghat) సమీపంలో గంగా నది (River Ganga)లో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోయిన కొందరిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 20 నుంచి 25 మంది వరకు గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారికోసం అధికారులు గాలింపు చేపడుతున్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికుల్ని ఎక్కించడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
Also Read..
Ram Charan | జీ20 సదస్సులో పాల్గొననున్న రామ్ చరణ్.. శ్రీనగర్ బయలుదేరి వెళ్లిన మెగా హీరో
Chidambaram | నల్లధనం మార్చుకునేవారికి మోదీ ప్రభుత్వం రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతోంది : చిదంబరం