ఒక పక్క రాష్ట్రంలో ఏనుగుల దాడులు, ఏనుగులపై మనుషుల దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మూడేళ్ల బాలిక ఒక ఏనుగు పాలు తాగుతూ కనిపించింది. ఈ ఘటన అస్సాంలోని గోలాఘాట్ ప్రాంతంలో వెలుగు చూసింది.
ఇక్కడ ఇటీవలి కాలంలో ఏనుగుల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో హర్షితా బోరా అనే మూడేళ్ల అమ్మాయి ఒక ఏనుగుతో ఆడుకుంటూ కనిపించింది. ఆ ఏనుగును ఆ పాప బిను అని పిలుస్తోంది.
బినుతో కాసేపు ఆడుకున్న హర్షిత.. ఆ తర్వాత బిను దగ్గరే పాలు తాగింది. ఆ ఏనుగు కూడా పసిపాప హృదయాన్ని అర్థం చేసుకుందేమో ఆ పాపను ఏమీ అనకుండా ఆ అల్లరిని భరించింది. ఆ తర్వాత హర్షితను తలపై ఎక్కించుకొని తిరిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.