Viral Video | పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓవైపు సంప్రదాయబద్ధంగా వివాహం జరుగుతుంటే.. మరోవైపు పెళ్లికి వచ్చిన అతిథులు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మండపంలో పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా.. నవ వధువు, వరుడికి హారతి ఇస్తోంది. వేడుకకు వచ్చిన వారంతా ఈ తతంగాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి కొంత మంది అతిథులు వాళ్లలో వారు పోట్లాడుకుంటూ కనిపించారు. ఈ ఘర్షణతో అక్కడ గందరగోళం నెలకొంది. ఇది గమనించిన వరుడు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా బంధువులు అడ్డుకున్నారు. అయితే ఘర్షణను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను రాజు రాజ్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.