న్యూఢిల్లీ: హైవేలు ఎక్కే వాహనాలు అన్నింటికీ గత నెల 15 నుంచి ఫాస్టాగ్లను కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలుసు కదా. ఇదే అదునుగా కొందరు కొత్త నకిలీ దందాకు తెరతీశారు. ఆన్లైన్లో నకిలీ ఫాస్టాగ్లు అమ్ముతున్నారని, వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) హెచ్చరించింది. ఈ మోసగాళ్లు అచ్చూ ఎన్హెచ్ఏఐ/ ఐహెచ్ఎంసీఎల్లాగే నకిలీ ఫాస్టాగ్లు అమ్ముతున్నట్లు తెలిపింది. ఇవి కూడా నిజమైనవాటిలాగే కనిపిస్తాయని, కానీ అవి నకిలీవని తేల్చి చెప్పింది. అందుకే ఇలాంటి మోసాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ఫాస్టాగ్ కొనుగోలు చేయడానికి https://ihmcl.co.in/ వెబ్సైట్లోకి లేదా మైఫాస్టాగ్ యాప్లోకే వెళ్లాలని ఎన్హెచ్ఏఐ సూచించింది. వీటి నుంచే కాకుండా అధీకృత బ్యాంకులు, పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్ల దగ్గర కూడా కొనుగోలు చేయవచ్చు. ఐహెచ్ఎంసీఎల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. ఈ నకిలీ ఫాస్టాగ్ల గురించి మీరు 1033 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇక ఫాస్టాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు.