మీకు గుర్తుందా? 2014 లో చెన్నైలో 12 అంతస్థుల భవనం ఒకటి కుప్పకూలిపోయింది. ఆ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో ఓ వ్యక్తి 72 గంటల పాటు కుప్పకూలిపోయిన భవనం కిందే ఉన్నాడు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఓ స్నిప్పర్ డాగ్.. శిథిలాల కింద ఓ వ్యక్తి చిక్కుకున్నాడని పోలీసులకు చూపించింది. దీంతో.. శిథిలాలను తవ్వి.. ఓ వ్యక్తిని బయటికి తీసి అతడి ప్రాణాలను రెస్క్యూ టీమ్ కాపాడింది. ఘటన జరిగిన 72 గంటల తర్వాత అతడు ఆ శిథిలాల నుంచి బయటపడ్డాడు. అంటే.. దాదాపు మూడు రోజులు అవే శిథిలాల కింద చిక్కుకున్నాడన్నమాట.
ఆ వ్యక్తి పేరు వికాస్ కుమార్, శిథిలాల నుంచి బయటికి వచ్చాక.. ఆ వ్యక్తి అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? తన ఫ్యామిలీ గురించి అడగలేదు.. తన భార్యాపిల్లల గురించి అడగలేదు.. డైరెక్ట్గా నా చెప్పులు ఏవి? అని అక్కడున్న సిబ్బందిని అడిగాడు. దీంతో రెస్క్యూ టీమ్ షాక్కు గురయింది. అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు.
2014లో జరిగిన ఘటన గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకోవడం అంటారా? దానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన స్టోరీ.. అదేనండి.. ఆ చెప్పుల స్టోరీ.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవడం మాత్రమే కాదు..నెటిజన్లు.. అయితే నవ్వలేక చస్తున్నారు. వామ్మో.. ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి