Viral Video | స్ట్రీట్ ఫుడ్ (Streat Food) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మన భారతీయులు రోడ్ సైడ్ ఫుడ్ తినేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందులోనూ టిఫిన్ ఐటెమ్స్ అయితే మరీనూ. వేడివేడి పూరీ, చపాతీ, దోశ, ఇడ్లీలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధారణంగా ఏ టిఫిన్ ఐటెమ్ అయినా సరే రూ.40 కి పైనే ఉంటోంది. ఇక ప్లేట్ పూరీ (Puri) తీసుకుంటే అందులో మూడు మాత్రమే వస్తాయి. అదీ కూడా రూ.40 నుంచి రూ.45 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, రాజస్థాన్లో ఓ జంట మాత్రం రూ.30కే 10 పూరీలను విక్రయిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.
జైపూర్కు చెందిన ఓ జంట (Jaipur Couple) రోడ్సైడ్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను నడుపుతూ.. ప్లేట్కు 10 పూరీలు అందిస్తోంది. అది కూడా కేవలం 30 రూపాయలకే. పూరీలకు కాంబినేషన్గా సబ్జీ (Sabzi) ని ఇస్తున్నారు. దీంతోపాటు సైడ్ డిష్ కింద టమోటా, వెల్లుల్లి చట్నీని కూడా సర్వ్ చేస్తున్నారు. రైతా కావాలంటే మాత్రం మరో రూ.10 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ స్టాల్ అందుబాటులో ఉంటుంది. అప్పటికప్పుడు వేడివేడిగా పూరీలు చేయిస్తుండటంతో జనం ఆ స్టాల్ వద్ద క్యూ కడుతున్నారు. రుచి కూడా చాలా టేస్టీగా ఉందంటూ కస్టమర్లు చెప్పుకుంటున్నారు. ‘మీరు దీన్ని ట్రై చేశారంటే.. కచ్చితంగా ఇష్టపడతారు’ అంటూ అక్కడ ఫుడ్ టేస్ట్ చేసినవారు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
Amritpal Singh | పంజాబ్లో అమృత్పాల్ పోస్టర్లు.. అతని గురించి సమాచారం అందిస్తే రివార్డు
Rahul Gandhi | రాహుల్ను చుట్టుముడుతున్న వరుస వివాదాలు.. మరో పరువు నష్టం కేసు నమోదు
Corona Virus | ఎండమిక్ దశకు కొవిడ్.. మరో పది రోజుల పాటు కొనసాగనున్న వైరస్ ఉద్ధృతి