భోపాల్ : మధ్యప్రదేశ్లోని బెతుల్లో నవవధువు ట్రాక్టర్పై పెండ్లి మండపానికి వచ్చిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. మహీంద్ర స్వరాజ్ ట్రాక్టర్పై వధువు భారతి టర్గే స్టైల్గా తన పెండ్లి వేదిక వద్దకు వచ్చింది.
ఇంజనీర్గా పనిచేస్తున్న భారతి రెడ్ ఎంబ్రాయిడరీ లెహెంగా ధరించి బ్లాక్ సన్గ్లాసెస్తో ట్రాక్టర్ను నడుపుతూ మండపానికి చేరుకుంది. మే 25న వాసు కవడ్కర్తో ఆమె వివాహం జరిగింది. ఆనంద్ మహీంద్ర భారతి వైరల్ వీడియోపై ట్విట్టర్లో మంగళవారం పోస్ట్ చేశారు. భారతి మహీంద్రా స్వరాజ్ను నడుపుతూ పెండ్లి మండపానికి చేరుకోవడం ఆకట్టుకుందని పారిశ్రామిక దిగ్గజం క్యాప్షన్గా రాసుకొచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు సులభంగా అందుబాటులో ఉంటాయని, ట్రాక్టర్ను నడపడం కూడా తనకు తెలుసని భారతి చెప్పారు. దీంతో పెండ్లి వేదిక వద్దకు ట్రాక్టర్పై వెళ్లి స్టన్నింగ్ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని భారతి చెప్పుకొచ్చారు. ట్రాక్టర్పై వచ్చిన వధువును చూసిన అతిధులు ఉత్సాహంగా ఆమెను స్వాగతించారు.
Bride named ‘Bharti’ driving a Swaraj. (A @MahindraRise brand) Makes sense… https://t.co/pfSNEe1MDh
— anand mahindra (@anandmahindra) May 31, 2022