హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో శనివారం నుంచి 40 రోజులపాటు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కొండగట్టు ఆంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కవిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులుకావాలని కోరారు.