ఇండియాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. దీంతో కూరగాయలు, మంచినూనె, పెట్రో ధరలు మండిపోతున్నాయి. నిత్యం సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. ధరల పెరుగుదలపై నెటిజన్లు సోషల్మీడియాలో మీమ్స్ రూపంలో జోకులు పేలుస్తున్నారు. తాజాగా, పంజాబ్కు చెందిన కూరగాయల వ్యాపారి ధరల పెరుగుదలపై ఓ కవిత చదివాడు. ఇది నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను షబ్నం హష్మీ అనే ట్విటర్ యూజర్ షేర్ చేశారు. పంజాబ్కు చెందిన కూరగాయల వ్యాపారి మార్కెట్లో కూర్చుని ఉంటాడు. కెమెరాను చూస్తూ ‘నింబు కెహదీ మైను హాత్, లగయీ నా, మిర్చా బోలే కుచ్ దిన్ మైను ఖయీ నా, టెల్ భీ కెహదా టంకీ భర్వాయి నా, కహ్వే సిలిండర్ మైను ఆగ్ లగయీ నా..’ అని కవిత అందుకున్నాడు. నిమ్మకాయ, మిర్చి, మంచినూనె, ఆఖరికి సిలిండర్ ధరలు కూడా పెరిగాయంటూ కవితాత్మకంగా చెప్పాడు. చివరగా భారతదేశ పరిస్థితిని శ్రీలంకతో పోలుస్తూ కవితను ముగించాడు. ‘గుర్విందర్ అద్భుతమైన కవిత’ అని ఈ వీడియోకు హష్మీ క్యాప్షన్ ఇచ్చాడు.
Gurvinder ki behtreen kavita . He is a vegetable seller , somewhere in Punjab I am assuming pic.twitter.com/YGEo5BNLbf
— Shabnam Hashmi (@ShabnamHashmi) April 17, 2022