దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా కూడా కొంత మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకాడుతున్నారు. వీరిలో చాలామంది వ్యాక్సిన్కు భయపడుతుంటే.. మరికొందరు వ్యాక్సిన్ను అసలు నమ్మడం లేదు. అయినా సరే దేశంలో వ్యాక్సీన్ డ్రైవ్ వేగంగా సాగిపోతోంది.
తాజాగా మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో జరిగిన ఘటన ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు.. వ్యాక్సిన్ అందించేందుకు ఇచ్చేందుకు ఇళ్లు పట్టుకు మరీ తిరుగుతున్నారు. ఛతర్పూర్లో కూడా అదే జరిగింది. అయితే వారి వాలకం చూడగానే ఆ బాలిక భయపడిపోయింది. ఇంట్లో నుంచి పారిపోయి పెరట్లో ఉన్న చెట్టు ఎక్కేసింది.
డాక్టర్ వచ్చి ఎంత బతిమిలాడినా దిగలేదు. గ్రామస్థులు కూడా సముదాయించడంతో చివరకు దిగొచ్చింది. కిందకు వచ్చి భయపడుతూనే వ్యాక్సిన్ తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.