కొందరు స్నేహితులు తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా గడిపేందుకు ఒక చోటకు వెళ్లారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి సంబరాలు చేసుకోబోయారు. అయితే ఊహించని రీతిలో జరిగిన సంఘటనకు వారంతా భయందోళన చెందారు. రెడ్డిట్లో తొలుత పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు స్నేహితులు తమ కుటుంబాలతో కలిసి షికారుకు వెళ్లారు. కార్లను ఒక చోట ఆపి పచ్చని లేన్లో కుర్చీలు వేసుకుని మహిళలు తమ పిల్లలతో ఉన్నారు. మరోవైపు కొందరు మగవారు టపాకులు కాల్చేందుకు సిద్ధమయ్యారు.
కాగా, స్నేహితుల్లో ఒకరు ఒక రాకెట్ను వెలిగించాడు. అయితే అది సరిగా పైకి వెళ్లలేదు. కారు కింద ఉంచిన మిగతా పటాకుల సమీపంలో అది పడింది. దానిని చూసేందుకు ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లాడు. అంతలో దాని నుంచి మంటలు వచ్చాయి. ఆ పక్కనే ఉన్న మిగతా పటాకులపై నిప్పు రవ్వలు పడ్డాయి. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
మరోవైపు మిగతా పటాకులన్నింటికి మంటలు అంటుకుని పేలుతుండటంతో ఆ వ్యక్తి వెంటనే అలెర్ట్ చేశాడు. దీంతో పచ్చగడ్డిపై కుర్చీల్లో కూర్చొన్న మహిళలు తమ చిన్న పిల్లలను చేతపట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ వెంటనే కారు కింద ఉంచిన పటాకులకు మంటలంటుకుని పేలాయి. దీంతో అక్కడ భారీగా మంటలు, పొగలు వ్యాపించాయి.
కాగా, 31 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ స్నేహితుల బృందం నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. మహిళలు, పిల్లలతో పాటు కారు కింద మిగతా పటాకులు ఉంచిన సమీపంలో వాటిని కాల్చడంపై విమర్శించారు. కారు పెట్రోల్ ట్యాంక్ కింద పటాకులు ఉంచితే మరింత బాగుండేది అంటూ ఒకరు ఎద్దేవా చేశారు.