భోపాల్ : నాలుగేండ్ల పాటు భిక్షాటన చేస్తూ వచ్చిన సొమ్మును ఆదా చేసిన యాచకుడు తన భార్యకు రూ 90,000 విలువైన మోపెడ్ను బహుమతిగా అందించాడు. మధ్యప్రదేశ్లోని చింధ్వారా జిల్లా అమరవర గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. సంతోష్ సాహు అనే యాచకుడికి రెండు కాళ్లు పనిచేయవు. భార్య మున్నిసాహుతో కలిసి త్రిచక్ర వాహనంలో వీధుల వెంట తిరుగుతూ సంతోష్ సాహు యాచించే వాడు.
మున్ని సాహు ట్రైసైకిల్ను తోస్తుండగా గుళ్లు, మసీదులు, బస్టాండ్ల వద్ద రోజూ యాచక వృత్తితో నెట్టుకొచ్చేవాడు. సాహు దంపతులు రోజుకు రూ 300 నుంచి రూ 400 వరకూ సంపాదించేవారు. మొత్తంమీద నాలుగేండ్లలో రూ 90,000 నగదు పోగేసిన సంతోష్ సాహు మోపెడ్ను కొనుగోలు చేయగా ఇప్పుడు ఆ దంపతులు మోపెడ్పై భిక్షాటన చేస్తున్నారు.