Viral Video | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రం భోపాల్ (Bhopal )లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. పెట్రోల్ (petrol) కొట్టించుకునేందుకు బైక్ (bike)పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లోని ఓ యువకుడు లైటర్ (lighter)తో నిప్పు అంటించాడు. ఈ ఘటనలో బైక్ సహా పెట్రోల్ నాజల్కు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటారాహిల్స్లోని స్ప్రింగ్ వ్యాలీ కాలనీలో గల రేణుక పెట్రోల్ పంపు (petrol pump) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు వ్యక్తులు బైక్పై పెట్రోల్ కోసం వచ్చారు. ఈ క్రమంలో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది బండిలో పెట్రోల్ నింపుతుండగా.. ముగ్గురులోని ఓ వ్యక్తి ఉన్నట్టుండి తన జోబులోని లైటర్తీసి నిప్పు రాజేశాడు. దీంతో బైక్, పెట్రోల్ నాజల్ (petrol nozzle)కు క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది బకెట్లతో ఇసుకను తీసుకొచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి కాలిన గాయాలయ్యాయి.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు (Police) ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి తనను తాను విజయ్ సింగ్గా పోలీసులకు చెప్పాడు. పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల పేర్లు భరత్ గట్ఖానే, ఆకాష్ గౌర్ అని తెలిపాడు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నారు. కాగా, దెబ్బతిన్న పెట్రోల్ పంపు నాజల్ విలువ సుమారు రూ.8,000 వరకు ఉంటుందని అంచనా. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
3 men set bike on fire at Bhopal petrol pump pic.twitter.com/AUZnzF8P7B
— Profile34 (@chamanpaani) May 25, 2023
Also Read..
Cannes 2023 | కేన్స్లో సన్నీ, అదితి, శృతి మెరుపులు.. ఫొటోలు వైరల్
Kerala State Lotteri | కేరళ లాటరీ డ్రా.. రూ.12 కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి