Kerala State Lotteri | కేరళ (Kerala)కు చెందిన ఓ వ్యక్తికి లాటరీ (Lotteri) ద్వారా అదృష్టం వరించింది. కేరళ లాటరీ డిపార్ట్మెంట్ ( Kerala State Lotteries ) అమ్మిన టికెట్ను కొనుగోలు చేసిన వ్యక్తి మొదటి బహుమతి కింద రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.
సాధారణంగా కేరళలో ఓనం, విషు, క్రిస్మస్ వంటి ప్రత్యేక పండుగల సమయాల్లో కేరళ లాటరీ డిపార్ట్మెంట్ బంపర్ లాటరీ టికెట్లు జారీ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల విషు పండుగ (Vishu Festival) సందర్భంగా విషు బంపర్ లాటరీ (Vishu Bumper Lottery) పేరుతో తిరువనంతపురం జిల్లాలో ఈ టికెట్లను కేరళ లాటరీ డిపార్ట్మెంట్ అమ్మింది. ఈ లాటరీలో మొదటి విజేతకు రూ.12 కోట్లు, రెండో విజేతకు రూ.కోటి, మూడో విజేతకు రూ.10 లక్షలు లాటరీ కింద గెలుచుకోనున్నారు.
ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం విషు బంపర్ లాటరీ (Vishu Bumper Lottery) డ్రా తీశారు. ఇందులో మలప్పురం జిల్లా తిరూర్లోని ఎం 5087 ఏజెన్సీకి చెందిన ఆదర్శ్ అనే వ్యక్తి విక్రయించిన వీఈ 475588 టికెట్ లాటరీలో మొదటి బహుమతి కింద విన్నయింది. ఆ టికెట్ కొనుగోలు చేసింది ఎవరన్నది ఇంకా తెలియలేదు. అయితే గెలుచుకున్న మొత్తంలో 10% ఏజెన్సీ కమీషన్, 30% ఇతర పన్నులు మినహాయించకుని మిగిలిన మొత్తం రూ.7.20 కోట్లు అతడు అందుకోనున్నాడు.
ఇక ఇదే డ్రాలో మరో ఆరుగురికి రెండో బహుమతి లభించింది. వీఏ 513003, వీబీ 678985, వీసీ 743934, వీడీ 175757, వీఈ 797565, వీజీ 642218 లాటరీ నంబర్లు రెండో బహుమతి గెలుచుకున్నాయి. వీరికి ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున అందజేస్తారు. ఇక వీఏ 214064, వీబీ 770679, వీసీ 584088, వీడీ 265117, వీఈ 244099, వీజీ 412997 టికెట్లకు మూడో బహుమతి లభించింది. వీరికి ఒక్కొక్కరికి రూ.10లక్షలు అందుకోనున్నారు.
Also Read..
Manipur Violence | అల్లర్లతో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు.. రూ.1800 చేరిన వంట గ్యాస్
Earthquake | కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం.. 10 నిమిషాల్లో రెండు సార్లు కంపించిన భూమి
Adah Sharma | కేరళ స్టోరీ నటికి షాక్.. నెట్టింట ఫోన్నంబర్ లీక్