Adah Sharma | విడుదలకు ముందు నుంచే రాజకీయంగా తీవ్ర వివాదం రేగిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). సుదీప్తో సేన్ (Sudipto Sen) తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మ (Adah Sharma) హీరోయిన్గా నటించింది. కేరళ రాష్ట్రంలో లవ్ జిహాద్ పెద్ద ఎత్తున జరుగుతోందని.. హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ముస్లిం యువకులు ప్రేమించి వాళ్ళను ఉగ్రవాదులుగా మారుస్తున్నారనే అంశాలను ‘ది కేరళ స్టోరీ’ మూవీలో చూపించారు. దీంతో ఈ చిత్రం రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. పలు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిషేధించారు కూడా.
కాగా, వివాదాస్పద చిత్రంలో నటించిన హీరోయిన్ ఆదాశర్మకు తాజాగా షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి నటి వ్యక్తిగత వివరాలను లీక్ చేశారు. ఆదా శర్మ ఫోన్ నంబర్ను ఇన్స్టాలో పోస్టు చేశారు. ఈ ఘటన తర్వాత ఆదా శర్మకు సోషల్ మీడియా ద్వారా వేధింపులు మొదలైనట్లు తెలుస్తోంది. కాగా, సదరు ఇన్స్టా యూజర్ తన అకౌంట్ను డీయాక్టివేట్ చేశాడు. అంతేకాకుండా, ఆమె కొత్త కాంటాక్ట్ నంబర్ను కూడా లీక్ చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది.
హిజాబ్, లవ్ జిహాద్ ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ (Sudipto Sen) ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అదా శర్మ (adah sharma) ప్రధాన పాత్ర పోషించారు. లవ్ జిహాద్ ద్వారా కేరళకు చెందిన 32 వేల మందిని ముస్లిం మతంలోకి మార్చి, సిరియాకు తరలించారనే ఆరోపణలపై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంపై కేరళ సహా పలు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు వాదనల ద్వారా సమాజంలో వర్గ విభేదాలు సృష్టించే లక్ష్యంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఈ వివాదాస్పద చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుండటం గమనార్హం. మే 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ.200 కోట్ల మేర వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
Also Read..
Arvind Kejriwal | నేడు శరద్ పవార్తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ
Sengol | కొత్త పార్లమెంట్లో రాజదండం
Naveen Patnaik | పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నాం.. ప్రకటించిన ఒడిశా సీం నవీన్ పట్నాయక్