Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) గురువారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party ) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar)ను కలవనున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann)తో కలిసి పవార్తో భేటీ కానున్నారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ఇదే విషయంపై పవార్తో సమావేశమై మద్దతు కోరనున్నారు.
ఢిల్లీలో అధికారుల పోస్టింగ్లు, బదిలీల విషయంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్ట్నెంట్ గవర్నర్ (ఎల్జీ)కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై ఆప్ (AAP) సర్కార్ పోరుబాటకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా తిరుగనున్నారు. ఆర్డినెన్స్ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రజల వద్దకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘నల్ల ఆర్డినెన్స్’కు వ్యతిరేకంగా జూన్ 11న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మహా ర్యాలీ చేపడుతామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే నెల నిర్వహించనున్న ర్యాలీకి ఢిల్లీ ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చింది.
Also Read..
Naveen Patnaik | పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నాం.. ప్రకటించిన ఒడిశా సీం నవీన్ పట్నాయక్
Currency notes | బ్యాంకులకు నోట్ల కొరత.. కరెన్సీ లేక ఆగిన రూ.2000 నోట్ల మార్పిడి
Sengol | కొత్త పార్లమెంట్లో రాజదండం