యాదాద్రి: యాదాద్రి ప్రధానాలయం ప్రారంభం అనంతరం కొండపైకి వెళ్లే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు కలుగకుండా ఉం డేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు గల మొదటి ఘాట్రోడ్డు వెడ ల్పు పనులను ఆదివారం ప్రారంభించారు.
కొండపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న ఓవర్ను మొదటి ఘాట్రోడ్డు అను సంధానం చేయనున్న నేపథ్యంలో నిత్యాన్నదానం సత్రం నుంచి హరిత హోటల్ వరకు గల రోడ్డును సుమారు 12 మీటర్ల వెడల్పుతో ఆధునీకరిస్తున్నారు. ప్రస్తుతం కేవ లం 7 మీటర్ల వెడల్పుతో ఉన్న ఘాట్రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకుగానూ ఘాట్ రోడ్డుకు ఇరు వైపులా ఉన్న గార్డెనింగ్, చెట్లను వైటీడీఏ అధికారులు తొలగించారు.