హైదరాబాద్: కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తక్షణ సాయంగా రూ. 2 లక్షలు అందించనుంది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే), ఇతర జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గత పది రోజుల్లో కరోనా బారినపడి మృతిచెందిన 15 మంది జర్నలిస్టులకు ఆర్థికసాయం కోసం మే 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. కరోనా రెండో దశలో వైరస్ పాజిటివ్లుగా నిర్ధారణ అయిన 200 మంది జర్నలిస్టులకు నేటి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..