ఢిల్లీ: ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోర పరాజయం పాలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో షాక్ తగిలింది. చెన్నైతో ఆదివారం జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. కనీస ఓవర్ రేటు మెయింటెన్ చేయని కారణంగా ప్రవర్తనా నియమావళి ప్రకారం ఫైన్ వేస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
రెండోసారి ఉల్లంఘిస్తే కెప్టెన్కు రూ.24 లక్షల జరిమానా విధించడంతో పాటు తుది జట్టులో ఉన్న ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా వేస్తారు. జట్లు తమ 20 ఓవర్ల బౌలింగ్ కోటాను 90 నిమిషాల్లోనే పూర్తి చేయాలని బీసీసీఐ కోరుకుంటోంది. 69 పరుగుల తేడాతో ఓడిన బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.