తిమ్మాపూర్, జూన్ 25 : పోటీ పరీక్షల నిర్వహణలో అధికారులు ఎన్ని క ఠిన నిబంధనలు తెచ్చినా.. ఎక్కడోచోట వ్యవస్థలోని లోపాలను ఆసరా గా చేసుకుని అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. కోర్టు ఉద్యోగం రా సేందుకు ఓ అభ్యర్థి దర్జాగా ఏకంగా సెల్ ఫోన్నే తీసుకెళ్లాడు. ఇన్విజిలేటర్ గుర్తించడంతో పరీక్షకే దూరమయ్యా డు. పరీక్ష నిర్వహించిన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీస్) సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో పరీక్ష రాసేందు కు ఎల్ఎండీకాలనీలో గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో సెంటర్ ఏర్పాటు చేశారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్షకు కోర్టులో ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే సిద్దిపేటకు చెందిన అభ్యర్థి విజయ్ కేంద్రం లోపలకు అండర్వేర్లో సెల్ఫోన్ పెట్టుకుని తీసుకెళ్లాడు. పరీక్ష చివరి కొద్ది నిమిషాలు ఉందనగా విజయ్వద్ద ఫోన్ సౌండ్ వినిపించడంతో అలర్ట్ అయిన ఇన్విజిలేటర్.. ఫోన్లో ఆన్సర్స్ చూస్తున్నాడని గమనించి అతడిని పట్టుకున్నారు. అధికారులు ఫోన్ డాటా మొత్తం పరిశీలించారు. ప్రశ్నలు ఎవరికైనా పంపాడా?, ఎన్ని సమాధానాలు ఫోన్లో నుంచి రా శాడు? అని విచారించారు. హాల్లోకి ఫోన్ ఎలా వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.