రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగ నియామక పరీక్షల సంస్కరణలు కోరుతూ నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు బుధవారానికి 20వ రోజుకు చేరాయి. విద్యార్థుల ఆందోళనపై జార్ఖండ్ ప్రభుత్వానికి ఆందోళనకారుల మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. శాసనసభ ముట్టడి, పోలీసుల జోక్యం, పలు విడతలుగా చర్చలు జరిగినప్పటికీ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు.
ప్రధానంగా రెండు డిమాండ్ల విషయమై ప్రభుత్వం, విద్యార్థి సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 2024 జేఎస్ఎన్సీ- సీజేఎల్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని ఆందోళనకారులు పట్టుబడుతున్నారు. అయితే ఈ పరీక్ష ద్వారా ఇప్పటికే 2,000 మందికి పైగా అభ్యర్థులు ఎంపికై, వివిధ ప్రభుత్వశాఖల్లో విధుల్లో చేరడంతో ప్రభుత్వం ఈ డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.జార్ఖండ్లో ఉప్పెనలా విద్యార్థుల ఆందోళన