ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్/హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 23: ఇచ్చిన మాట తప్పకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కా వాలా? లేక డీజిల్, వంటగ్యాస్, వంటనూనెల ధరలు పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మో పుతున్న బీజేపీ ప్రభుత్వం కావాలా? అనేది ప్రజలు ఆలోచించాలని ఆర్థికమంత్రి హరీశ్రావు సూచించారు. సీఎం కేసీఆర్ కుడి చేత్తో రైతులకు ఇస్తుంటే, బీజేపీ మాత్రం ఎడమ చేత్తో గుంజుకొంటున్నదని మండిపడ్డారు. గు రువారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణా లు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయతో కలిసి హాజరయ్యారు. మండలంలోని 18 గ్రామాల్లో 682 స్వయం సహాయ సంఘాలకు రూ.3.14 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని ఏ గ్రామంలోనూ మహిళా సంఘ భవ నం లేకపోవడం బాధాకరమన్నారు. పేరుకే పెద్దరికం తప్ప ఈటల రాజేందర్ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. 17 ఏండ్లు ఎ మ్మెల్యేగా ఉండి భవనాలు ఎందుకు కట్టలేదో మహిళలు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని గ్రామాల్లో మహిళాసంఘ భవనాలు
మండలంలోని 18 గ్రామాల్లో మహిళా సంఘ భవనాలకు రూ. 2.36 కోట్లు మంజూ రు చేసినట్టు హరీశ్రావు తెలిపారు. నాలుగు నెలల్లో భవనాలు పూర్తిచేసి కాబోయే ఎమ్మెల్యే గెల్లు శ్రీనివాస్తో ప్రారంభం చేసుకుందామని చెప్పారు. మండల సమాఖ్య భవనానికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. 57 ఏండ్లు నిండిన వృద్ధులందరికీ రాబోయే రెండు నెలల్లో ఆసరా పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో రూ.2016 ఆసరా పెన్షన్ ఇస్తుంటే, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.600 ఇస్తున్నారని తెలిపారు. రైతుబంధును పరిగె అని, పెన్షన్లు కడు పు నింపవని, కల్యాణలక్ష్మి దండగ అని ఈటల రాజేందర్ మాట్లాడటం ఎంతవరకు సబబో మహిళలు ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు నీటి తీరువా పన్ను రద్దుచేసి, ఉచిత కరెంటు ఇస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం వ్యవసాయ బోర్లు, బావులకు మీటర్లు పెట్టాలంటున్నదని విమర్శించారు. యార్కెట్ యా ర్డు రద్దు, నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. అలాంటి బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్లో చేరిన మందాడిపల్లి, ఇప్పలపల్లి యాదవులు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అత్యధిక మెజార్టీ సాధించేలా కృషిచేయాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గెస్ట్హౌస్లో వీణవంక మండల ఇప్పలపల్లి, హుజూరాబాద్ మండలం మందాడిపల్లికి చెందిన యాదవులు 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్రెడ్డి, వొడితల ప్రణవ్బాబు, మందాడిపల్లి సర్పంచ్ ఎల్లయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సొంత జాగల్లో ఐదువేల ఇండ్లు
అన్ని గ్రామాల్లో కుటీర పరిశ్రమలు నెలకొల్పుతామని మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి ప్రజలకు సొంత జాగల్లో మరో 5 వేల ఇండ్లు కట్టిస్తామని హామీఇచ్చారు. ఇల్లందకుంట దేవస్థానానికి రూ.10 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ రైతులకు రూ.50 వేల వరకు రుణమాఫీ చేశామని, వచ్చే మార్చి వరకు రూ.లక్ష రుణమాఫీ కూడా చేస్తామని తెలిపారు. మహిళలంతా మంచిని, ధర్మాన్ని కాపాడాలని కోరారు.