నమస్తే తెలంగాణ నెట్వర్క్: దళితులను అసభ్య పదజాలంతో దూషించిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కుటుంబంపై దళితలోకం భగ్గుమన్నది. దళిత ద్రో హి ఈటలా.. ఖబర్దార్ అని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు గురువారం ఈటల దిష్టిబ్మొలను దహనం చేసి నిరసన వ్యక్తంచేశాయి. దళితులను కించపరిచిన ఈటల బావమరిది మధుసూదన్రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డికి ప లువురు ఫిర్యాదు చేశారు.
ఈటల కుటుంబంపై అట్రాసిటీ కేసు పెట్టాలి
ఈటల రాజేందర్ కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి పాపయ్య డిమాండ్చేశా రు. మధుసూదన్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్లో పలుచోట్ల దళిత సంఘాల నాయకులు గురువారం నిరసన వ్యక్తంచేశారు. ఈటలతోపాటు, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్చేస్తూ మేడి పాపయ్య నాయకత్వంలో లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దళితబంధు పథకాన్ని బీజేపీ నేతలు ఓర్వలేకనే అడ్డుకొనేందుకు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేయిస్తున్నారని పాపయ్య ఆరోపించారు. కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ నాయకులు బంగారు శ్రీనివాస్, నంద కిషోర్, యాదగిరి, కృష్ణ, దశరథ, సురేశ్, సాయి లు, నర్సింగ్రావు పాల్గొన్నారు. కంటోన్మెంట్లో ఎ మ్మెల్యే సాయన్న సారధ్యంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగం జేబీఎస్ వద్ద ఈటల దిష్టిబొమ్మను ద గ్ధం చేసింది.
కార్యక్రమంలో నళినికిరణ్, గంగారామ్, సంతోష్, తేజ్పాల్, శ్రీకాంత్, శర్విన్, మహేశ్, రాజేశ్, సుధీర్ పాల్గొన్నారు. దళితులకు ఈటల వెంటనే క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్వీ నేతలు తుంగబా లు, చందు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్వీ నాయకులు గురువారం ఉస్మానియావర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓయూజేఏసీ చైర్మన్ బండారి వీరబాబు, విద్యార్థి నేతలు వల్లమల కృష్ణ, మంద సురేశ్ ఆధ్వర్యంలో ఈటెల కుటుంబంపై ఓయూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నేతలు కిరణ్గౌడ్, పడాల సతీశ్, కృష్ణ, భాస్కర్యాదవ్, నాగయ్య, జంగయ్య, ప్రశాంత్, నరేశ్, మదన్, ప్రవీణ్, సత్యనారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు. మధుసూదన్రెడ్డిని అరెస్టు చేయాలని డీజీపీకి రా ష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీనాయక్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈటల కుటుంబసభ్యులు దళిత, బీసీ, ముస్లిం మైనార్టీలను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అట్టుడికిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా
ఈటల బావమరిది వ్యాఖ్యలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దళితులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం అట్టుడికిపోయింది. చెల్పూర్, పోతిరెడ్డిపేట, సిర్సపల్లితోపాటు జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంకలో దళిత సం ఘాలు నిరసన తెలిపాయి. చొప్పదండి, మధురానగర్చౌరస్తా, రామడుగులో మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మను దహనంచేశారు. బుడగజంగాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మౌటం రాంకుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి హుజూరాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. అక్కడే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దళితులపై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా బీజేపీ నేతలు దాడు లు చేశారు. ఈటలను ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స భ్యుడు దుమాల రాజ్కుమార్, నాయకులు బాలె శంకర్ డిమాండ్చేశారు. కొడిమ్యాలలో వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, టీఆర్ఎస్ ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు నేరెళ్ల మహేశ్, ఆర్బీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు బండపల్లి అంజన్కుమార్ ఆధ్వర్యంలో, మల్యాల, ధర్మపురిలో ఈటల, మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మలు దహనంచేశారు. పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మారంలో ఆందోళన నిర్వహించారు. ఎన్టీపీసీలో టీఆర్ఎస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈటల దిష్టిబొమ్మను గోదావరిలో నిమజ్జనం చేశారు.
శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం..
కాకతీయవర్సిటీ ఎదుట కేయూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఈటల దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చే శారు. కమలాపూర్ మండలంలో మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మను దహనంచేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి బొచ్చు కరుణాకర్, దళిత నేతలు కొర్నేల్, ప్రేమానందం, వక్కల మార్కు, వరకుమార్, జైసిల్కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం, నూతనకల్, అర్వపల్లి, నకిరేక ల్, కట్టంగూర్, నల్లగొండలో దళిత, బహుజన సంఘా ల ఆధ్వర్యంలో ఈటల, ఆయన బావమరిది దిష్టిబొమ్మలను దహనం చేశా రు. దళితులను కించపరిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హెచ్చరించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈటలపై నిరసనలు వ్యక్తమయ్యాయి. చేవెళ్ల, మోమిన్పేట, శంకర్పల్లి మండలాల్లో యాదయ్య ఆధ్వర్యంలో ఈటల దిష్టిబొమ్మను ద హనం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఈటల, మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మలను దళితులు దహనంచేశారు. మంచిర్యాల, చెన్నూర్లోని అంబేద్కర్ చౌరస్తా, బెల్లంపల్లి, తాండూర్ పట్టణాల్లో మధుసూదన్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
దళితబంధును ఆపలేరు
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ఆపడం ఎవరి తరం కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి పేర్కొన్నారు. గురువారం ఆయన జనగామ జిల్లా చిల్పూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రూపొందించిన దళిత బంధు ద్వారా సత్ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 లక్షల దళిత కుటుంబాలు, 62 లక్షల జనాభా అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ఉద్యమంలా అమలుచేస్తామని చెప్పారు. ఈ పథకం దేశానికి అదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంపై అసత్య ప్రచారాలు చేయడం కంటే సలహాలు, సూచనలివ్వడం మంచిదని ప్రతిపక్షాలకు హితవు పలికారు.