హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. మంత్రి కేటీఆర్కు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులను, వారి పిల్లలను రాజకీయాల్లోకి లాగడం ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నాయకురాలిగా తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. మహిళలను కించపరచడం, బాడీ షేమింగ్ చేయడం సరికాదన్నారు. ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల విషయంలో రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.