సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి లోని రగుడులో తేలు కాటుతో దొంతుల మాలతి (21) అనే యువతి మృతి చెందింది.
వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న మాలతి ఇటీవలే ఇంటికి వచ్చింది.
అయితే వ్యవసాయ పనుల కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో తేలు ఉన్న అంగి వేసుకొని పనులు చేస్తుండగా తేలు కాటుకు గురైంది. అప్పటికే అంగి లోపల ఉన్న తేలు పలుచోట్ల కాటు వేయడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
గుర్తించిన స్థానికులు కరీంనగర్ దవాఖానకు తరలించారు. రెండు రోజులపాటు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మాలతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు.