హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రణాళికా విభాగాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించేలా చూసేందుకు కాకతీయ గవర్నెన్స్ ఫెలోస్ పేరిట యు వ నిష్ణాతుల బృందాన్ని ఎంపిక చేశారు. అమెరికా, కెనడా, లండన్, ఆస్ట్రేలియా సహా దేశంలోని వివిధ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఎకనమిక్స్, ఫైనాన్స్, ఐఐటీ, రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, మెడిసిన్ రంగాలకు చెందిన యు వ నిష్ణాతులకు ఈ బృందంలో చోటు కల్పించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ఆర్థ్ధిక, ప్రణాళికా శాఖల ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, అర్థ గణాంకశాఖ డైరెక్టర్ దయానంద్, ప్రణాళికశాఖ డైరెక్టర్ షేక్ మీరా, రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధి సంస్థ అధికారి రామభద్రం తదితరులు బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కీలక సమావేశాన్ని నిర్వహించి ఈ బృందానికి దిశానిర్దేశం చేశారు.
ఈ టీమ్తో వినోద్కుమార్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఈ యంగ్ టీమ్ ఎంపిక ద్వారా అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాలు, ఆయా శాఖల పనితీరుపై సూక్ష్మస్థాయిలో పరిశీలన జరుపుతుంది. అనంతరం ఈ టీమ్ సమర్పించే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వినోద్కుమార్ తెలిపారు. కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్, సిజేష్ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన విజయ్ పింగాలే, పారుల్ అగర్వాల్, దేబశిష్, మాతంగి జ యరాం, సుమిత్కౌర్ తదితరులు వర్చువల్గా ముఖాముఖిలో పాల్గొన్నారు. తెలంగాణ వెదర్ అండ్ ైక్లెమెటాలజీ పుస్తకాన్ని, పిడుగుల నుంచి రక్షణకు చేపట్టాల్సిన చర్యల వివరాలతో కూడిన సీడీని వినోద్కుమార్ ఆవిషరించారు.